చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిలా పీఎస్పరిధిలో ఆర్టీసీ బస్సు వాటర్ట్యాంకర్ను ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం రాత్రి10 గంటలకు మెహిదీపట్నానికి చెందిన ఆర్టీసీ బస్సు శంకర్పల్లి నుంచి నార్సింగి వైపు వెళ్తోంది. జన్వాడలోని బంగారు మైసమ్మ ఆలయం వద్దకు రాగానే యూటర్న్తీసుకుంటున్న వాటర్ట్యాంకర్ను ఎడమవైపు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రవీందర్(27), కండక్టర్ లక్ష్మణ్ కుమార్(50), ప్రయాణికుడు ఇస్మాయిల్(27) తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు గాయపడిన వారిని ఓ ప్రైవేట్హాస్పిటల్కు తరలించారు. బస్సు డ్రైవర్రవీందర్.. క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో అతడిని బయటికి తీసేందుకు చాలా సేపు శ్రమించాల్సి వచ్చింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరాబాబు తెలిపారు.

